Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెజాన్‌లో రిటర్న్‌ టూ వర్క్‌ పాలసీ..నిర్ణయం మార్చుకోవాలని ఉద్యోగుల వేడుకోలు

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన రిటర్న్‌ టూ వర్క్‌ పాలసీపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సంస్థ సీఈఓ ఆండీ జెస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవలే కీలక ప్రకటన చేశారు సీఈఓ ఆండీ జెస్సీ. కార్పొరేట్‌ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని స్పష్టం చేశారు. ఈ కొత్త పాలసీ మే 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అమెజాన్‌ లీడర్‌షిప్‌, ఎస్‌-టీమ్‌, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ద్వారా ఉద్యోగులు కలిసి పని చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడానికి, కొత్త ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.చివరగా 2021, అక్టోబర్‌లో ఈ-కామర్స్‌ దిగ్గజం కరోనా మహమ్మారి ఎరా పాలసీకి క్రమంగా ముగింపు పలికేందుకు సిద్ధమైంది. మేనేజర్‌ స్థాయి ఉద్యోగులు వారి టీమ్‌ సభ్యులు ఆఫీసులకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. కరోనా తర్వాత వైట్‌ కాలర్‌ సిబ్బంది పూర్తిగా హైబ్రిడ్‌ మోడ్‌లో పని చేస్తున్నారు. రిమోట్‌ వర్క్‌ కోసం సంస్థ అన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మీడియా ప్రకారం.. అమెజాన్‌ ఉద్యోగులు స్లాక్‌ ఛానల్‌ క్రియేట్‌ చేసి తమ ఆందోళనలను దాని ద్వారా తెలియజేస్తున్నారు. ఇటీవలే ప్రకటించిన రిటర్న్‌ టూ వర్క్‌ పాలసీకి వ్యతిరేకంగా తమ గొంతుకను వినిపిస్తున్నారు. గత మంగళవారం నుంచి ఏకంగా 14,000 మంది అమెజాన్‌ ఉద్యోగులు స్లాక్‌ ఛానల్‌లో జాయిన్‌ అయ్యారు. మరోవైపు.. వారంతా తమ ఆందోళనను ఫిర్యాదు రూపంలో రాసి సంతకాలు చేసి సీఈఓ ఆండీ జెస్సీ, ఎస్‌-టీమ్‌కి పంపించినట్లు సమాచారం. కొత్త పాలసీపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వైవిధ్యంపై అమెజాన్‌ దృక్పథానికి ఇది విరుద్ధంగా మారుతుందని పేర్కొన్నారు.

‘ వెంటనే రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని రద్దు చేసి గ్లోబల్‌ రిటైల్‌, టెక్‌ లీడర్‌ స్టేటస్‌, రోల్‌ను అమెజాన్‌ పటిష్ఠం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఉద్యోగులు తమకు అనూకులంగా రిమోట్‌ వర్క్‌ చేసేందుకు కొత్త పాలసీని తీసుకురావాలి.’ అని కోరారు. ఈ విషయాన్ని అంతకు ముందు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ సైతం పేర్కొంది. గతంలో సీఈఓ ఆండీ జెస్సీ ఒకే సైజ్‌ అందరికీ సరిపోదనే విధానాన్ని నమ్మేవారని, దాని ద్వారా టీమ్స్‌ వర్క్‌ బెస్ట్‌గా ఉంటుందని, రిమోట్‌ వర్క్‌ను మెచ్చుకునే వారని గుర్తు చేశారు. దీనిని అనుసరించే ఉద్యోగులను తమ లైఫ్‌ను ప్లాన్‌ చేసుకున్నారని, తమ సంస్థ ఎప్పడూ ఆఫీసులకు రావాలని బలవంతం చేయదనే నమ్మకంపై ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ ద్వారా అమెజాన్‌ లీడర్స్‌పై తమ నమ్మకాన్ని కోల్పోయ ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు.. కరోనా మహమ్మారి సమయంలో రిమోట్‌ పొజిషన్స్‌ కోసం నియామకమైన ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీ తమపై ఏ విధంగా ప్రభావం చూపుతుందోనని భయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img