Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమ్మాయిల వివాహ వయసు పెంపు..లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన స్మృతి ఇరానీ

బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు 2021ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అన్ని మతాల్లో వివాహ వయసు ఒక్కటిగా ఉండాలన్నారు. ఈ సవరణ బిల్లుతో.. మహిళల కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని, మహిళల పట్ల తమకు ఎటువంటి భేదభావం లేదన్నారు. మహిళ 18 ఏళ్లకు గర్భవతి అయితే.. అప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. . దేశ మహిళల తరపున ఈ బిల్లును తీసుకువచ్చిన ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడిరచారు. అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. తొందరపడి ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. ఎందుకు ఇలాంటి బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ఈ బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి సిఫారసు చేయాలన్నారు. తృణమూల్‌ ఎంపీ సౌగత్‌ రాయ్‌ మాట్లాడుతూ..ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడిరచారు. ఆర్టికల్‌ 25ను ఉల్లఘించినట్లు అవుతుందని విపక్ష సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఈ బిల్లును విత్‌డ్రా చేసుకోవాలన్నారు. బిల్లు ఆర్టికల్‌ 19కు వ్యతిరేకమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img