కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి
ఇప్పటివరకు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ఇక్కడికి 22,500 మందికి పైగా తరలించామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం ఇంకా పూర్తయిపోలేదని చెప్పారు. ఈ మేరకు అరిందమ్ బాగ్చి మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారికి సాధ్యమైన సాయం చేస్తాం. కొందరు ఖేర్సన్లో ఉన్నారని చెప్పారు. కొందదు వేరేచోట చిక్కుకుపోగా, మరికొందరు వచ్చేందుకు ఇష్టపడట్లేదని అన్నారు. తమ అంచనా ప్రకారం, దాదాపు 15 నుంచి 20 మంది ఇక్కడకు వచ్చేయలనుకుంటున్నారని, వాళ్లను తరలించేందుకు మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు.