Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img