జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బందిపొరా జిల్లాలోని గుంద్జహంగిర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున అనంత్నాగ్ జిల్లాలోని వెరినాగ్ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.