Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 18,132 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 193 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607కు చేరింది. ఇందులో 3,32,93,478 కరోనా నుంచి బయటపడగా, 2,27,347 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో 2,27,347 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 10,691 కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో కొత్తగా 85 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95.19 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img