Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటూ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు నిప్పుల కొలిమిని తలపించింది. ఎండల దెబ్బకు జనాలు అల్లాడిపోయారు.. ఉష్ణొగ్రతలు ఏకంగా 47 వరకు నమోదయ్యాయి. ఉక్కపోత, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడ్డారు. అయితే సమ్మర్ హీట్ నుంచి రిలీఫ్ ఇస్తూ చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కోస్తాలోని జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అంతేకాదు గురువారం ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలి వాన భీభత్సం సృష్టించింది. ఈ వర్షం, గాలుల దెబ్బకు వృక్షాలు నేలకూలాయి. అక్కడక్కడా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. .శ్రీకాకుళం, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరుతో పాటూ మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలతో ఎండల నుంచి కాస్త రిలీఫ్ పొందారు జనాలు. మరోవైపు ఈ ఏడాది జూన్‌ 15 నాటికి ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రతి ఏటా మే 20 నాటికి అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ప్రతి ఏటా జూన్‌ 1 నాటికి కేరళను తాకేవి. ఈ ఏడాది మాత్రం మూడు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న కేరళను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు ఎండల విషయానికి వస్తే.. రాష్ట్రంలో శుక్రవారం 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా 5, గుంటూరు 1, కాకినాడ 1, ఎన్టీఆర్ 2, పల్నాడు 2, మన్యం 5, విజయనగరం 5, వైఎస్సార్ జిల్లాలోని 8 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గురువారం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 27 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు.

10 రోజుల క్రితం కూడా ఏపీలో వానలు జోరుగా పడ్డాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిశాయి. ఈ అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. ధాన్యం తడిచిపయి మొలకెత్తిన పరిస్థితి.. ఇతర పంటలు కూడా ధ్వంసం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img