Friday, April 26, 2024
Friday, April 26, 2024

కులగణన చేపట్టాలి

ప్రధాని మోడీని కలిసిన నితీష్‌ బృందం
బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మొత్తం 10పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కులాల వారీగా జనగణన చేపట్టాలని వాళ్లు డిమాండు చేశారు. భేటీ ముగిసిన తర్వాత బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.ప్రధాని తమ అభ్యర్థనలు విన్నారని.. కులాలవారీ జనగణన పట్ల సానుకూలంగా స్పందించారని వెల్లడిరచారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని తమ బృందం కోరిందని చెప్పారు. ఈరోజు ప్రధానిని కలిసిన బృందంలో నితీష్‌కుమార్‌తో సహా ఆర్జేడీ నేత నేత తేజస్వి యాదవ్‌ కూడా ఉన్నారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాదు.. యావత్‌ దేశంలోనూ కుల గణన చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేసినట్లు తేజస్వి వెల్లడిరచారు. దేశంలో కులాలవారీగా జనాభాను లెక్కించాలంటూ డిమాండ్స్‌ వస్తుండటంతో కేంద్ర మాత్రం ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img