Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోర్టు ఆదేశాలను పాటించరా ?

సీబీఐపై మరోసారి హైకోర్టు ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై మంగళవారం ధర్మాసనం ముందు అత్యవసర విచారణ జరిగింది. రిజిస్టార్‌ జనరల్‌ నుంచి లెటర్‌ వచ్చిన వెంటనే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌ ఖాతాల నుంచి పంచ్‌ ప్రభాకర్‌ పోస్ట్లు తొలగించి, బ్లాక్‌ చేశారని ధర్మాసనం దృష్టికి స్టాండిరగ్‌ కౌన్సిల్‌ అశ్వినీ కుమార్‌ తీసుకువెళ్లారు. తాము కూడా లెటర్‌ రాశామని సీబీఐ పేర్కొంది. దీంతో తమరు లెటర్‌ రాసి ఉపయోగం ఏమిటని సీబీఐను ధర్మాసనం ప్రశ్నించింది. పంచ్‌ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని సీబీఐను కోర్టు కోరింది. సరైన సమాధానం రాకపోవటంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మేము చెప్పింది మీరు వినకపోతే మీరు చెప్పేది మేం వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ఏం చేయాలో తామే ఆదేశాలు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించే యోచన చేస్తామని పేర్కొంది. కోర్టులో విచారణ తర్వాత పంచ్‌ ప్రభాకర్‌ గూగుల్‌లో తన ఫోటోతో సహా చిరునామా పెట్టారని ధర్మాసనం దృష్టికి స్టాండిరగ్‌ కౌన్సిల్‌ అశ్విని కుమార్‌ తీసుకువచ్చారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే యోచన చేస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img