133 మంది ప్రయాణికుల దుర్మరణం..
చైనాలో ఘోర ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బోయింగ్ 737 విమానంలో ప్రయాణం చేస్తున్న 133 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ చైనా గ్వాంగ్జీ జియాంగ్ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో విమానం కుప్పకూలింది. మంటలు చెలరేగి విమానం కుప్పకూలినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడిరచారు. స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్ నగరం నుంచి గుయాంగ్రaౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయంది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద సమాచారం ఉంది. ఆ వెంటనే గుయాంగ్జి ప్రాంతంలోని వుజౌ నగర సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు తెలుస్తోంది. ఇది మధ్యాహ్నం 3.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. చైనా ఎయిర్లైన్ డేటా ప్రకారం.. గత దశాబ్ద కాలంలో ఇదే ఘోర ప్రమాదమని అధికారులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.