జాతిపిత మహాత్మాగాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్ఘాట్, విజయ్ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, దిల్లీ సీఎం కేజ్రివాల్ తదితరులు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.