Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 1,109 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 4.5 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 1,109 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 76 కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 43 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క కేరళలోనే 36 మంది మరణించడం గమనార్హం. ఇక ప్రస్తుతం దేశంలో 11,492 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,25,00,002 మంది కరోనా నుంచి కోలుకోగా 5,21,573 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img