కోస్టారికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సాన్ జోస్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో దిగుతుండగా ఓ కార్గో విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఆ విమానం రెండు ముక్కలైంది. వివరాల్లోకి వెళితే, జర్మన్కు చెందిన డీచ్ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో (కోస్టారికా కాలమానం ప్రకారం) శాన్జోస్ శివారులో ఉన్న జుయాన్ శాంతామారియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే కొద్ది నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండిరగ్ కోసం ఎయిర్పోర్ట్ అనుమతి కోరగా, అందుకు అనుమతి వచ్చింది. ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.