Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 14,623 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. ముందురోజు 13,058 కేసులు నమోదవగా, తాజాగా అవి 14 వేలు దాటాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 14,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,08,996కు చేరింది. ఇందులో 1,78,098 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కోలుకున్న వారి సంఖ్య 3,34,78,247గా ఉంది. కరోనా బారినపడి మరో 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 19,446 మంది కోలుకోగా, 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఒకేరోజు 41,36,142 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 99,12,82,283 కరోనా టీకా డోసులును పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img