Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 16,299 మందికి పాజిటివ్‌రాగా, నేడు ఆ సంఖ్య 16,561కి పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరింది. ఇందులో 4,35,73,094 మంది కోలుకోగా, 5,26,928 మంది మహమ్మారితో మరణించారు. మరో 1,23,535 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 18,053 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 49 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక రోజువారీ రికవరీ రేటు 5.44 శాతానికి పెరిగిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 207.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img