బకాయిలపై కోర్టును ఆశ్రయించిన నార్మన్ ఫోస్టర్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన డిజైన్లు రూపొందించిన నార్మన్ ఫోస్టర్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం ఆర్బిట్రేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీ (ఏఎంఆర్డీఏ)కి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్ సంస్థ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఫోస్టర్ సంస్థ రాజధాని నిర్మాణ ప్రణాళిక, భవన ఆకృతులు రూపొందించింది. అయితే తమకు రావాల్సిన సొమ్ము మాత్రం చెల్లించడం లేదని పేర్కొంది. తమకు రావల్సిన బకాయిలపై ఏఎంఆర్డీఏకి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2019 జూన్ తర్వాత నుంచి బకాయిలపై అనేకసార్లు లేఖలు రాసినట్లు వెల్లడిరచింది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది. తమకు రావాల్సిన నిధులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని సుప్రీంకోర్టును ఫోస్టర్ సంస్థ కోరింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏఎంఆర్డీఏకి నోటీసులు జారీచేసింది.