Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ప్రస్తుతం కట్టడిలోనే ఉంది. మహమ్మారి తీవ్రత ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోతోంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 వేల నుంచి 5 వేల మధ్యలో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,614 కరోనా కేసులు నమోదవగా, 89 మంది మృతిచెందారు. మరో 5185 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 4,29,87,875కు చేరాయి. ఇందులో 4,24,31,513 మంది బాధితులు కోలుకున్నారు. మరో 40,559 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,15,803 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసుల్లో 0.09 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. 98.70 శాతం మంది డిశ్చార్జీ కాగా, 1.20 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతమని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 1,79,91,57,486 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 18,18,511 మంది వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img