Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 4,912 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో 4,39,90,414 మంది బాధితులు కోలుకోగా, 5,28,487 మంది మృతిచెందారు. మరో 44,436 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలవగా, 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.41 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img