Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొద్దిరోజులుగా కొత్త కేసులు 10 వేల దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 5,221 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరింది. ఇందులో 4,39,25,239 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 5,28,165 మంది మరణించారు. ఇంకా 47,176 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 5975 మంది కరోనా నుంచి బయటపడగా, 11 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. 215.26 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img