Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 8,503 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం 9419 కేసులు నమోదవగా.. తాజాగా 8,503 రికార్డయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కు చేరాయి. ఇందులో 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటివరకు 4,74,735 మంది బలయ్యారు. ప్రస్తుతం 94,943 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 7,678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,31,18,87,257 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది.అలాగే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img