Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img