Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,283 కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,11,481 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763కి చేరగా.. మరణాల సంఖ్య 4,66,584 కి పెరిగింది. కాగా నిన్న కరోనా నుంచి 10,949 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 3,39,57,698 కి చేరింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 118.44 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. గత 24గంటల్లో 76.58 లక్షల డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img