దిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు సోనూసూద్ పనిచేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మీడియా సమావేశంలో సోనూసూద్, అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. సోనూసూద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు. లక్షలాది మంది విద్యర్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈరోజు లభించిందని, విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని అన్నారు.