Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నా గొంతు నొక్కేందుకు ట్విటర్‌పై ఒత్తిడి

ఫాలోవర్లు నానాటికీ తగ్గిపోతున్నారు
సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు రాహుల్‌ లేఖ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ సీఈఓకు లేఖ రాశారు. తన ఫోలోవర్లను స్తంభింపజేశారని, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వ ఒత్తిడితో తన గొంతును నొక్కేందుకు ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్యపై అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 2021లో తన ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినప్పటి నుంచి వాస్తవంగా ఫాలోవర్లను స్తంభింపజేసిందని పేర్కొంటూ సోషల్‌ మీడియా సంస్థ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు రాహుల్‌ గాంధీ డిసెంబరు 27న లేఖ రాశారు. ఈ లేఖలో తన ఫాలోవర్ల వివరాలను రాహుల్‌ తెలియజేశారు. లేఖలో, ‘ భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రసంగాన్ని అరికట్టడంలో ట్విట్టర్‌ పాత్ర ఉందని నేను భావిస్తున్నానని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అనాలోచిత కుట్ర’. ఇది మాత్రమే కాదు, నా గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తన ట్విట్టర్‌ ఫాలోవర్లు నానాటికీ తగ్గిపోతున్నారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నెలకు 2.3 లక్షల మందికిపైగా తన ఖాతాను కొత్తగా ఫాలో అవుతున్నారని, కొన్ని నెలల్లో ఇది 6.5 లక్షలుగా ఉందన్నారు. కానీ, ఆగస్టు 2021 నుంచి నెలకు దాదాపు 2,500 మంది కొత్త ఫాలోవర్లు తగ్గుతున్నారని, ఈ కాలంలో తన ఫాలోవర్లు 19.5 మిలియన్ల మంది వాస్తవంగా స్తంభించిపోయారని అన్నారు. గతేడాది ఆగస్టులో ఢల్లీి అత్యాచార బాధిత కుటుంబం ఫోటోను ట్విట్టర్‌లో రాహుల్‌ గాంధీ షేర్‌ చేయడంతో వివాదస్పదమయ్యింది. బీజేపీ నేతల ఫిర్యాదు చేయడంతో చట్టాన్ని ఉల్లంఘించారని రాహుల్‌ ఖాతాను ట్విట్టర్‌ 8 రోజులు నిలిపివేసింది.అయితే, తిరిగి పునరుద్దరించిన తర్వాత కూడా రాహుల్‌ ట్విట్టర్‌ ఖాతాకు అనేక ఆటంకాలు ఎదురయినట్టు కాంగ్రెస్‌ పేర్కొంది. రాజకీయ ప్రచారంలో కీలక సాధనంగా మారిన ట్విట్టర్‌ను ప్రభావితం చేసేలా తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘భారత్‌లో నిరంకుశత్వం పెరగడానికి ట్విట్టర్‌ సహాయపడకుండా చూసుకోవాల్సిన అపారమైన బాధ్యత మీపై ఉంది’ అని రాహుల్‌ తన లేఖలో స్పష్టం చేశారు. సంప్రదాయ మీడియాపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోందని, ప్రజా సమస్యలను లేవనెత్తడంలోనూ, ప్రభుత్వాన్ని నిలదీయడంలో సోషల్‌ మీడియా మరింత కీలకమైందని పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం మధ్య సైద్ధాంతిక యుద్ధం సోషల్‌ మీడియా వేదికగా రూపుదిద్దుకుంటోంది.. ఇది ట్విటర్‌ వంటి సంస్థల సారథ్యంలో ఉన్న వారిపై మరింత బాధ్యతను ఉంచుతోంది’అని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

ట్విటర్‌ స్పందన
దీనిపై ట్విటర్‌ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ట్విటర్‌ ప్లాట్‌ఫాంను మానిప్యులేషన్‌, స్పామ్‌ చేయడాన్ని ఎంత మాత్రం సహించేది లేదన్నారు. తాము స్పామ్‌, మాలిషియస్‌ ఆటోమేషన్‌లపై వ్యూహాత్మకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. మెషిన్‌ లెర్నింగ్‌ టూల్స్‌ను భారీగా వినియోగించి వీటిపై పోరాడుతున్నామన్నారు. ఆరోగ్యకరమైన సేవలు అందేవిధంగానూ, విశ్వసనీయమైన ఖాతాలు ఉండేవిధంగానూ తాము నిలకడగా చేపడుతున్న చర్యల వల్ల ఫాలోయర్‌ కౌంట్స్‌ మారుతుండవచ్చునన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img