Friday, April 26, 2024
Friday, April 26, 2024

నేనా.. ప్రధానా…ఆ ఆలోచనే లేదు : నితీష్‌ కుమార్‌

బీహార్లో బీజేపీని వీడి మహాకూటమిలో పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్‌ కుమార్‌ పై దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ప్రత్యర్ధిగా విపక్షాల కూటమి తరపున ఆయన నిలబడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నితీష్‌కుమార్‌ ఇవాళ మాట్లాడారు.ప్రధాని పదవిపై తనకు ఆలోచన లేదని చెప్పారు. అయితే దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. అందరూ కలిసి పనిచేయాలని నితీష్‌ కుమార్‌ కోరారు. తాను దేనికీ పోటీదారుని కాదని చెప్పారు. 2014లో వచ్చిన వ్యక్తి 2024లో గెలుస్తాడా అనేది అడగాల్సిన ప్రశ్న అని అన్నారు. ఇక ప్రధాని పదవిపై తనకు ఆలోచన లేదని నితీశ్‌ కుమార్‌ చెప్పేయడంతో విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే నితీష్‌ ప్రధాని అయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మిత్రపక్షం ఆర్జేడీ సహా పలు పార్టీలు ఇప్పటికే మద్దతిస్తున్నాయి. ఇప్పటి నుంచే నితీష్‌ను ప్రధాని అభ్యర్ధిగా ఫోకస్‌ చేస్తే ఉపయోగం ఉంటుందని విపక్షాలు అంచనా వేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img