బీహార్ సీఎం నితీశ్ కుమార్
ప్రశాంత్ కిశోర్కు పబ్లిసిటీ ఎలా పొందాలో తెలుసని… పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిశోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. బీహార్లో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వండని చెప్పారు. 2005 నుంచి బీహార్లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించిన నితీశ్ కుమార్… ఆయనకు కేవలం పబ్లిసిటీ ఎలా పొందాలి, స్టేట్ మెంట్లు ఎలా ఇవ్వాలి అనేది మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. బీజేపీ కోసం ప్రశాంత్ కిశోర్ రహస్యంగా పని చేస్తున్నారని అన్నారు. బీజేపీతో ఉండాలని ఆయన మనసులో ఉన్నట్టుందని చెప్పారు. ఢల్లీి పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నితీశ్ కుమార్పై వ్యాఖ్యలు చేశారు.