Friday, April 26, 2024
Friday, April 26, 2024

పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో పవన్ చెప్పాలని ఆదిమూలపు సురేశ్ డిమాండ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అని.. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడన్నారు. ఒక వైపు బీజేపీతో ఉంటూ మరోవైపు టీడీపీతో కలిసి పని చేస్తున్నాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో పవన్ చెప్పాలని అన్నారు. నాలుగు ఎమ్మెల్సీలు కైవసం చేసుకోగానే టీడీపీ నేతలు ఏదో సాధించేసినట్టు ఫీలవుతున్నారని… వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కూడా లేరని అన్నారు. వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని… తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని చెప్పారు. ఈ స్కాం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img