Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘బీర్‌భూం’ సామూహిక సజీవదహనాల కేసు..సీబీఐకి అప్పగింత

పశ్చిమబెంగ్‌లో సంచలనం సృష్టించిన ‘బీర్‌భూం’ సామూహిక సజీవదహనాల ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడిరచింది. బెంగాల్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. ఇక ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తన ఆదేశాల్లో హైకోర్టు పేర్కొన్నది. ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి ఆ ఘటనకు సంబంధించిన రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సీబీఐని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాత్సవ్‌, జస్టిస్‌ ఆర్‌ భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img