భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. రూ.50 వడ్డింపు
గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. చమురు సంస్థలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. దిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ తగ్గించింది. తాజాగా సిలిండర్పై రూ.8.50 కోతవిధించింది. ఈ నెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే.