ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అథనమ్ గెబ్రియాసిస్ వార్నింగ్ ఇచ్చారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. రాబోయే మహహ్మరి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 హెల్త్ ఎమర్జన్సీ ముగింపుతో .. కోవిడ్ ఆరోగ్య సంక్షోభం ముగిసిపోలేదన్నారు. కోవిడ్కు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, దాని వల్ల కలిగే ప్యాథోజన్లతో మరింత ప్రమాదరకర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని టెడ్రోస్ అన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్వో చీఫ్ ఈ రిపోర్టును ప్రజెంట్ చేశారు.