Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ పెరిగిన పాజిటివ్‌ కేసులు, మరణాలు


కొత్తగా 39,097 నమోదు…546 మంది మృతి
దేశంలో గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 39,097 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది. ఇందులో 4,08,977 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 35,087 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో గడచిన 24 గంటల్లో 546 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,20,016 చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 8 వేల 977 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా 3 కోట్ల 5 లక్షల 3 వేల 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. . గడచిన 24 గంటల్లో దేశంలో 42 లక్షల, 67 వేల 799 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు.కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img