పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దుసుకెళుతోంది. 89 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్తో కలసి విజయం గుర్తు చూపిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు. మార్పు కోరుకున్న పంజాబ్ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.