Friday, April 26, 2024
Friday, April 26, 2024

మూడోరోజు 21 వేల పైనే కరోనా కేసులు

దేశంలో కొత్తగా 21,411 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడోరోజు 21,411 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,68,476కు చేరాయి. ఇందులో 4,31,92,379 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,997 మంది మృతిచెందారు. మరో 1,50,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 67 మంది మరణించగా, 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.34 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img