టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. ఈరోజు రష్యాకి చెందిన యుగేవ్ జావుర్తో ఫైనల్లో తలపడిన రవి కుమార్ దహియా 4-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. దీంతో స్వర్ణం పతక ఆశలు రేపిన రవి కుమార్.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఆరంభం నుంచి యుగేవ్ జావుర్ దూకుడు ప్రదర్శించాడు. దాంతో.. కాసేపు డిఫెన్స్లో కనిపించిన రవి దహియా ఆ తర్వాత సెమీస్ తరహాలో డబుల్ లెగ్ ఎటాక్ కోసం చాలా ప్రయత్నించాడు. కానీ.. యుగేవ్ మాత్రం తెలివిగా తప్పించుకుంటూ రవికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తంగా మూడు నిమిషాల మొదటి రౌండ్ ముగిసే సమయానికి 2-4తో రవి వెనుకబడ్డాడు. ఆ తర్వాత రౌండ్లోనూ రవికి నిరాశే ఎదురైంది. యుగేవ్ జావుర్ అటాకింగ్తో వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లగా.. రవికి పుంజుకునే అవకాశమే దక్కలేదు.