Friday, May 3, 2024
Friday, May 3, 2024

రెజ్లింగ్‌లో భారత్‌కి రజత పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్‌ దహియాకు రజతం లభించింది. ఈరోజు రష్యాకి చెందిన యుగేవ్‌ జావుర్‌తో ఫైనల్లో తలపడిన రవి కుమార్‌ దహియా 4-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. దీంతో స్వర్ణం పతక ఆశలు రేపిన రవి కుమార్‌.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఆరంభం నుంచి యుగేవ్‌ జావుర్‌ దూకుడు ప్రదర్శించాడు. దాంతో.. కాసేపు డిఫెన్స్‌లో కనిపించిన రవి దహియా ఆ తర్వాత సెమీస్‌ తరహాలో డబుల్‌ లెగ్‌ ఎటాక్‌ కోసం చాలా ప్రయత్నించాడు. కానీ.. యుగేవ్‌ మాత్రం తెలివిగా తప్పించుకుంటూ రవికి ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. మొత్తంగా మూడు నిమిషాల మొదటి రౌండ్‌ ముగిసే సమయానికి 2-4తో రవి వెనుకబడ్డాడు. ఆ తర్వాత రౌండ్‌లోనూ రవికి నిరాశే ఎదురైంది. యుగేవ్‌ జావుర్‌ అటాకింగ్‌తో వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లగా.. రవికి పుంజుకునే అవకాశమే దక్కలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img