డార్జిలింగ్ జిల్లాలోని ఫన్ సిదేవా ప్రాంతం నుంచి న్యూజల్ పైగురి వైపు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు సీ-3, సీ-6 కోచ్ల కిటికీల అద్దాలు రాళ్లదాడితో ధ్వంసమయ్యాయి. ఈ సమాచారాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) అందించింది. జనవరి 3.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైల్ నంబర్- 22302) తనిఖీ చేస్తుండగా, రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.