Friday, April 26, 2024
Friday, April 26, 2024

పరిపాలనలో మార్పు కోసమే గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశాం: జగన్‌

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష
మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని ఆదేశం
శాఖాధిపతులు సచివాలయాలను సందర్శించాలని సూచన

పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసం గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివరించారు. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని.. సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. సిబ్బంది హాజరు దగ్గరనుంచి.. అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలని సూచించారు.
మండల స్థాయిలో పర్యవేక్షణ..
‘గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాలవారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్‌ఓపీలు ఉండాలి. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. అర్జీల పరిష్కారం ముఖ్యమైనది. వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు.. ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలి. రీ వెరిఫికేషన్‌ కోసం పైవ్యవస్థకు వెళ్లడం అన్నది ప్రధానం. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని జగన్‌ ఆదేశించారు.
పరిష్కారంపై దృష్టిపెట్టాలి..
‘ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే.. కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారు. దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టిపెడతారు. లేకపోతే అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలే. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలం. క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు.. సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలం. లేకపోతే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఏపీ నంబర్‌ వన్‌గా నిలవాలి..
‘సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా నిలవాలి. అలాగే సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూదు. టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదు. నిరంతరం టెక్నాలజీని అప్‌డేట్‌ చేయాలి, వారిని అప్‌డేట్‌గా ఉంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకొండి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయండి. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.
ఇంటర్నెట్‌ సౌకర్యం..
అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని.. అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img