Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సర్జరీ ప్రారంభించారు.. మావల్ల కాదని మధ్యలోనే ఆపేశారు

కొందరు వైద్యుల తీరు.. ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ఉంటోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు డాక్టర్లు మాత్రం మారడం లేదు. తాజాగా. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్వాకం నివ్వెరపోయేలా చేసింది. వృద్ధురాలి కాలుకు జరుగుతున్న చికిత్సను డాక్టర్లు మధ్యలోనే ఆపేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ.. ఇంట్లో జారిపడిరది. దీంతో తొడ ఎముక వద్ద గట్టిగా దెబ్బ తగిలింది. ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 4న చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి.. కొద్దిరోజులు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విరిగిన ఎముక ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయాలని చెప్పి.. ప్రైవేటు ఎక్స్‌రే ప్లాంటుకు రాశారు. ఎక్స్‌రే తీసుకురాగా.. శస్త్రచికిత్స చేయాలని డేట్‌ డిసైడ్‌ చేశారు. వృద్ధురాలిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లాక.. పలు కారణాలు చెప్పి వాయిదా వేశారు. తాజాగా.. బుధవారం శస్త్రచికిత్స ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు.తొడ భాగాన్ని కోసిన వైద్యులు.. మధ్యలోనే కుట్లు వేసి.. చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పేషెంట్‌ బంధువులు నివ్వెరపోయారు. డాక్టర్లను ప్రశ్నిస్తే ఎముకలు గట్టిగా లేవని చెబుతున్నారని వాపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. తాను సంబంధిత వైద్యులతో మాట్లాడతానని.. న్యాయం చేస్తానని సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చారు. బాధితురాలిని ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనతో డాక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img