Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీబీఐపై సుప్రీంకోర్టులో మనీశ్‌ సిసోడియా పిటిషన్‌.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్‌

సీబీఐ అరెస్ట్‌ ను సుప్రీంలో సవాల్‌ చేసిన సిసోడియా
లిక్కర్‌ స్కామ్‌ లో ఢల్లీి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లో ఆయనను విచారించాల్సి ఉందని… తమ కస్టడీకి అప్పగించాలని ఢల్లీి కోర్టులో పిటిషన్‌ వేయగా… ఆయనను ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో మనీశ్‌ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.ఈ పిటిషన్‌ కు సంబంధించి సీజేఐ డీవై చంద్రచూడ్‌ వాదనలు వింటూ… హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్‌ సింఫ్వీు మాట్లాడుతూ…. జర్నలిస్ట్‌ వినోద్‌ దువా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ను ప్రస్తావించారు. కోవిడ్‌ ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వంపై దువా చేసిన విమర్శల కేసులో… ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీజేఐ… మధ్యాహ్నం 3.50 గంటలకు విచరణ చేపడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img