Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లంకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లాలోని నష్‌కల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్థారించారు. ఈ నెల 9వ తేదీన రాజు మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చి లైంగికదాడి జరిపాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గత ఏడు రోజుల నుంచి రాజు కనిపించకుండా పోయిన అతన్ని పట్టుకునేందుకు 70 బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. అన్ని వైన్‌ షాపుల వద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. బస్సులు, ఆటోలపై రాజు ఫోటోలు ప్రదర్శించి.. అతని ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. రాజు నిన్న ఉప్పల్‌ ప్రాంతంలో సంచరించినట్లు తెలుస్తోంది. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img