Friday, April 26, 2024
Friday, April 26, 2024

230 రోజుల కనిష్టానికి కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 230 రోజుల కనిష్టానికి చేరాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడిరచింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయి. . ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారు. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారు. గడిచిన 24 గంటల్లో 19,582 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా, మరో 166 మంది మరణించారు. దీంతో రికవరీ రేటు 98.12 శాతం, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img