Friday, April 26, 2024
Friday, April 26, 2024

70:30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు

కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్‌ ఆదేశాలు అమలు చేయాలి
సగం వాటా కావాలన్న తెలంగాణ డిమాండ్‌ సరికాదు
కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

విఅమరావతి : కృష్ణా జలవివాదాల రెండో ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్స రానికి 70:30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి బుధవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా జలాల పంపిణీలో సగం వాటా కావాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్‌ దగ్గర విచారణ జరుగుతున్న నేపథó్యంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సమంజసం కాదని పేర్కొంది. ట్రిబ్యునల్‌ అవార్డు వచ్చేంత వరకూ తాత్కాలికంగా కృష్ణాజలాల్లో 50:50 నిష్పత్తిలోనే నీటి పంపకాలు చేయాలని తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్‌ఎంబీ ఏపీ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై స్పందిస్తూ ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి ప్రత్యుత్తరం పంపారు. నీటి పంపకాల్లో ఆ వాటా సహేతుకం కాదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయిం పులు చేయలేదని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనలు విధించినట్లు వెల్లడిరచింది. నాగార్జున సాగర్‌లో విద్యుత్‌ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు స్పష్టం చేసింది. ఏపీ

పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాల కోసం 1,059 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేసింది. దీనిప్రకారం ఏపీకి 70 శాతం, తెలంగాణకి 30శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్‌ఎంబీని కోరింది.
వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చండి
ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ను కోరుతూ బుధవారం లేఖ రాశారు. తాగునీటి కోసం ప్రకాశం జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అను మతులు లేవని గెజిట్‌లో పేర్కొన్నారని, ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధ మన్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని, అలాంటి జిల్లాకు అన్యాయం చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img