Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నేటి నుంచి 13వ తేదీ దాకా పలు రైళ్ల రద్దు

నిర్వహణ కారణాలు, ఒడిశా ప్రమాదం నేపథ్యంలో నిర్ణయం
ఒడిశాలోని బాలాసోర్‌‌లో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఇప్పటికే పలు రూట్లలో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే బుధవారం నుంచి ఈ నెల 13 వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలాసోర్ ప్రమాదంతో పాటు నిర్వహణ కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్టు తెలిపింది. నిజామాబాద్‌ఉకాచిగూడ, కాచిగూడఉనిజామాబాద్‌, నిజామాబాద్‌ఉనాందేడ్, నాందేడ్‌ఉనిజామాబాద్‌ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. వీటితోపాటు డౌండ్ఉనిజామాబాద్, ముద్ఖేడ్ఉనిజామాబాద్ రైలు బుధవారం నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేసింది. నిజామాబాద్ఉపంధర్పూర్, నిజామాబాద్ఉ ముద్ఖేడ్ రైళ్లను గురువారం నుంచి ఈ నెల 14 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-హౌరా రైలును రేపటి వరకు రద్దు చేశారు. శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయంఉ హౌరా, వాస్కోడిగామాఉషాలిమార్, కాచిగూడ, బెంగళూరు అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లను గురువారం వరకు రద్దయ్యాయని, ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు. మరోవైపు వేసవి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న పలు రైళ్లను పొడిగించారు.కాచిగూడఉతిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల8 వరకు, తిరుపతిఉకాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9 వరకు, కాచిగూడఉకాకినాడ టౌన్ మధ్య నడిచే రైలును ఈ నెల 10 వరకు, కాకినాడ టౌన్ఉకాచిగూడ స్పెషల్ ను ఈ నెల 11వరకు, కాచిగూడఉనర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల8 నుంచి 29 వరకు, నర్సాపూర్ఉకాచిగూడ స్పెషల్ ట్రైన్ ను 9 నుంచి 30 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img