దీని మూలంగా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు : ప్రధాని
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో గుణపాఠాలు నేర్పిందని, దీని మూలంగా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు పూనాది ఏర్పడిరదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.దేశ ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విద్యా రంగం నుంచి వైద్య రంగానికి అనుసంధానంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ గురువారం రాజస్థాన్లో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. దీంతోపాటు జైపూర్ సీతాపురలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనాను అరికట్టేందుకు, ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు నిమగ్నమైనట్లు చెప్పారు. ఈ తరుణంలో భారత్ బలాన్ని, స్వశక్తి పెంచుకునేందుకు ముందడుగు వేసిందన్నారు. ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. దీనిలో భాగంగా కేంద్రం ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిందని.. అందరికీ వ్యాక్సినేషన్ అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 88 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు వెల్లడిరచారు. ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేశంలోని ప్రతి మూలలో ఆరోగ్య సేవలను విస్తరించడంలో సహాయపడుతుందని చెప్పారు.