Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేరళలో వర్షబీభత్సం

ఐదుగురి మృతి బ రంగంలోకి సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌
ఐదు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
ఏడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌

తిరువనంతపురం : కేరళలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల ధాటికి కొట్టాయం, ఇడుక్కిలలో కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. రహదా రులన్నీ వరదనీటితో నిండిపోవడంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. దీనితో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటు న్నారు. ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. రహదారులన్నీ పూర్తిగా నీటిమునగడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుపోయింది. దాంతో బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
కొండ చరియలు విరిగిపడటం, రహదారులు జలమయం కావడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. దాంతో కేరళ ప్రభుత్వం భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) సహకారం కోరింది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దిగాయి. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో చాలా హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం బలగాలను మోహరించింది. కొట్టాయం గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు 12మంది గల్లంతైనట్టు సమాచారం. పతనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూరు జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ జారీ చేయగా.. తిరువనంత పురం, కొల్లం, అలప్పుజ, పాలక్కడ్‌, మలప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌లలో ఆరంజ్‌ అలర్ట్‌ జారీచేశారు. రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. ఇడుక్కి ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి మరణించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img