Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 2,55,874 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు..2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటి రేటు 15.52 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడిరచింది. ఇప్పటివరకు మొత్తం 3,97,99,202 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 4,90,462కు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img