Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,571 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసుల సంఖ్యతో పోలిస్తే 3.4శాతం పెరిగింది.దేశ వ్యాప్తంగా 3,63,605 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి 530 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.దేశంలో రికవరీ రేటు 97.54%గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img