దేశంలో మరోసారి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు పెరిగాయి. గురువారం సీఎన్జీ కిలోకు రూ.2.5 పెరిగింది. ఢల్లీితో పాటు చుట్టుపక్కల నగరాల్లో గురువారం సీఎన్జీ ధర కిలోకు రూ.2.5 పెంచామని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) తెలిపింది. ఏప్రిల్ 14వతేదీ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి.ఢల్లీిలో సీఎన్జీ కిలో రూ.71.60, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో కిలో రూ.74.17, ముజఫర్నగర్, మీరట్, షామ్లీలలో రూ. 78.84,గురుగ్రామ్ కిలో 79.94 రూపాయలకు పెరిగింది.