Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వారి ఆశల్ని వమ్ము చేయలేం..

ఈ ఏడాది జరిగే ఎన్డీఏ పరీక్షల్లోనే మహిళలకు అనుమతి ఇవ్వాలి : సుప్రీం
వచ్చే ఏడాది నుంచి ఎన్డీఏ పరీక్షల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళలకు ఆశలు నింపామని, జాప్యం చేసి ఇప్పుడు ఆ ఆశల్ని వమ్ముచేయలేమని పేర్కొంది. ఈ ఏడాది జరిగే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షల్లోనే మహిళలకు అనుమతి కల్పించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది మే నెలలో మహిళల తొలి బ్యాచ్‌ పరీక్షలు రాయాలని కేంద్రం తన పిటిషన్‌లో అభిప్రాయపడిరది. అయితే ఈ ఏడాది నవంబర్‌ 14వ తేదీన రిలీజయ్యే నోటిఫికేషన్‌లోనే మహిళలకు అవకాశం కల్పించాలని యూపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ మేలో మహిళలు పరీక్షలు రాస్తే, అప్పుడు వాళ్ల రిక్రూట్మెంట్‌ 2023 జూన్‌లో జరుగుతుందని, ఇలాంటి చర్యలతో జాప్యం చేయలేమని స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img