దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. పలు నగరాల్లోని వీధులు రంగులతో నిండిపోయాయి. ప్రజలు ఈ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ ఎంతో ఘనంగా జరుపుకొంటున్నారు. యువతీయువకులు, చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కొన్ని చోట్ల యువత నృత్యాలు చేస్తూ.. సందడి చేశారు.ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ ఆలయం , పంజాబ్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ , దేశ రాజధాని ఢల్లీి సహా తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.