విశాలాంధ్ర`నరసరావుపేట కలెక్టరేట్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ హెచ్సి 987 షేక్ అబ్దుల్ సమ్మద్ భాష కుటుంబానికి పోలీసు భద్రత పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.20.60 లక్షలను పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి భాష సతీమణి షాహిదాకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ బిందు మాధవ్, పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు పాల్గొన్నారు.