Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

విశాలాంధ్ర`పొన్నూరు : పొన్నూరు పట్టణంలో శుక్రవారం అంబేద్కర్‌ సెంటర్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. సెంట్రింగ్‌ యూనియన్‌ నాయకులు పగడాల వెంకటేశ్వర్లు, గుంటూరు ఏడుకొండలు, రాడ్‌ బెండిరగ్‌ యూనియన్‌ అధ్యక్షులు మిక్కిలి జాన్‌ పెయింటింగ్‌ యూనియన్‌ అధ్యక్షులు జి.హెబ్రీజర్‌ బాబు, బుజ్జి రవి, శేషు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు ఆరేటి రామారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆరేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని వారి సాధక బాధలు పరిగణములోకి తీసుకొని తగు పథకాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదు అందజేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సరైన న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img